Sunday, May 5, 2024

మొక్కల సంరక్షణకు చర్యలు..

మెట్‌పల్లి: హరిత శుక్రవారం సందర్భంగా అంబేద్కర్‌ పార్క్‌లో మొక్కలకు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ శ్రీమతి రణవేణి సుజాత సత్యనారాయణ నీరు పోశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్‌ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని, పార్కులో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ చంద్రశేఖరరావు, కో ఆప్షన్‌ మెంబర్‌ ఏషాల రాజశేఖర్‌, సానిటరీ ఇన్స్పెక్టర్‌ టి రమేష్‌, ఎన్విరాన్మెంట్‌ ఇంజనీర్‌ విష్ణు, శానిటేషన్‌ ఇంచార్జ్‌ ముజీబ్‌, ధర్మేందర్‌, జి రమేష్‌, జనార్ధన్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement