Tuesday, April 30, 2024

హమాలీలకు మాస్క్ లు..

ఎల్లారెడ్డిపేట: కరోనా తీవ్రత వల్ల ధాన్యపు కొనుగోలు కేంద్రాలలో పని చేసే హమాలీలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా టిఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తోట ఆగయ్య, జెడ్పీటిసి లక్ష్మణ్‌రావులు కోరారు. మండలంలోని హరిదాస్‌నగర్‌ పలువురు హమాలీలకు మాస్క్‌లు పంపిణీ చేశారు. గ్రామంలో ఐకేపి అధ్వర్యంలో వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం హమాలీలకు మాస్క్‌లు పంపిణీ చేశారు. కరోనా జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కో- ఆర్డినేటర్‌ రాదారపు శంకర్‌, నాయకులు పిల్లి కిషన్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement