Monday, April 29, 2024

ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని నారాయణపూర్‌ గ్రామంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్‌ ధర్మనాయక్‌ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ అందరూ వేయించుకోవాలని, ఎవరు భయపడవద్దన్నారు. కరోనా వ్యాధి వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నిమ్మ లక్ష్మీ, ఉపసర్పంచ్‌ మహేందర్‌, మాజీ సర్పంచ్‌ దొమ్మాటి నర్సయ్య, ఎంపీటీ-సీ ఆఫేరా సుల్తానా, హెల్త్‌ సెంటర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement