Sunday, May 12, 2024

మౌళిక సదుపాయాల కల్పనకు కృషి.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి రూరల్ : గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి, పెద్దబొంకూర్ గ్రామాల్లో సోమవారం సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నివర్గాలకు మేలు జరిగేలా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, సర్పంచులు గాండ్ల మల్లేశం, కారుపాకల మానస సంపత్, ఎంపీటీసీలు నిర్మల శ్రీనివాస్, వసంత వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement