Saturday, April 27, 2024

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. అదివారం జిల్లా కేంద్రం సమీపంలోని రంగంపల్లి, పెద్దబొంకూర్ వద్ద రాజు రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల అధికారులు పనిచేస్తున్నారన్నారు.

రైతులు తమ కులాల వద్ద స్టార్టర్లు నీటిలో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ రాజేష్, కౌన్సిలర్లు చంద్రశేఖర్, మాధవి తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement