Tuesday, May 7, 2024

ఉప్పొంగిన వాగులు..

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం కమలాపురం మధ్య జీడివాగు పొంగి పొర్లుతుంది. దీంతో బూర్గంపాడు ప్రధాన రహదారిపై నుండి వరుద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వాహనాలు అన్ని కూడా ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.

ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లవాగు
ములుగు జిల్లాలోని గోవిందరావు పేట మండలం పస్ర గ్రామంలో ఉన్న గుండ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చుట్టూ ప్రక్కల ఉన్న చిన్నచిన్న కాలువల ద్వారా వస్తున్న నీరు గుండ్ల వాగులో చేరడంతో దాని ప్రవాహం పెరిగింది. గుండ్ల వాగు పరిసర ప్రాంతాలు అన్ని కూడా జలమయం అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement