Friday, April 26, 2024

దిష్టిబొమ్మ దహనం..

ఎన్‌టీపీసీ: స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మెయిన్‌ గేట్‌ ముందు యాజమాన్యం దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. స్థానికులకు, ప్రభావిత గ్రామాల భూ నిర్వాసితులు, ఎఫ్‌సీఐ మాజీ కాంట్రాక్టు కార్మికులకు, ఉద్యోగుల పిల్లలకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునర్నిర్మాణంలో పని చేసిన స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమం ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రామగుండం రీజియన్‌ కార్యదర్శి బుర్ర తిరుపతి, నాయకులు సల్ల రవీందర్‌, చంద్రశేఖర్‌, కరీమ్‌, మార్క సతీష్‌, రామన్న, కొండల్‌, సాంబశివుడు, ప్రీతమ్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement