Friday, March 29, 2024

కరోనాతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని వెంకటాపూర్‌ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఒలాద్రి యాదగిరి (54) కరోనా బారిన పడి మరణించారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పేటకు చెందిన యాదగిరి ఎల్లారెడ్డి పేట మండలంలోని పలు గ్రామాల పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. యాదగిరి మరణం పట్ల ఉపాధ్యాయులు, మిత్రులు, బంధువులు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement