Thursday, April 25, 2024

కొనుగోలు కేంద్రం ప్రారంభం..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని తిమ్మాపూర్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో గొల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్‌ చైర్మన్‌ బుగ్గ కృష్ణమూర్తి ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. కరోనా కేసులు పెరుగుతున్నందున భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ కొండ రమేశ్‌ గౌడ్‌, ఎంపీటీసీ ల్యాగల శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ పెంజర్ల దేవయ్య, ఎండీ జబ్బార్‌, ఏఈఓ ముకుందం, డైరెక్టర్లు పెండ్యాల సంతోష్‌రెడ్డి, పెంజర్ల నారాయణ, గుర్రాల సతీష్‌రెడ్డి, సీఈఓ శశివర్దన్‌, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement