Thursday, May 16, 2024

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లిరూరల్‌: గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పెద్దబొంకూర్‌ గ్రామంలో ఎస్‌డిఎఫ్‌ నిధుల కింద రూ. 17.10 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగుతూ నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పిటిసి బండారి రామ్మూర్తి, సర్పంచ్‌ కారుపాకల మానస సంపత్‌, ఎంపీటీ-సీ వసంతతోపాటు వార్డుసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement