Monday, May 6, 2024

అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్ళిన దళిత మోర్చా నాయకులు..

వేములవాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు. జిల్లా అధ్యక్షులు సంటి మహేష్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లారు. హైదరాబాద్‌లో దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ దమనకాండను ప్రశ్నించే గొంతుకలను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement