Saturday, April 27, 2024

కలవర పెడుతున్న కరోనా..

ఎల్లారెడ్డిపేట: కరోనా వైరస్‌ రెండవ వేవ్‌ తీవ్రత మండలంలోని పలు గ్రామాలలో ప్రజలను వణికిస్తోంది. మండలంలోని గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రంలో 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు మండల వైద్యాధికారి ధర్మనాయక్‌ తెలిపారు. కాగా గొల్లపల్లి, బొప్పాపూర్‌ గ్రామాలలో కరోనా బారిన పడ్డ వారిలో రవీందర్‌ అనే వ్యాపారి మరణించడంతో కరోనా వ్యాధి సోకిన వ్యాపారుల కుటుంబాల్లో కలవరం మొదలైంది. కొందరు వ్యాపారులకు కరోనాతో శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడటంతో వారిని అంబులెన్స్‌లో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలెషన్‌ వార్డుకు తరలించారు. కరోనా వ్యాధి ప్రబలకుండా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు, అధికారులు పోలీసులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement