Sunday, April 28, 2024

రైతు ప్రాణాలు కాపాడిన ఎస్‌ఐ..

ఇల్లంతకుంట : ప్రమాదవశాత్తు బావిలో పడిన రైతు ప్రాణాలను ఇల్లంతకుంట ఎస్‌ఐ మల్లేశం గౌడ్‌ గ్రామస్తుల సహకారంతో కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కాసుపాక రాజయ్య అనే కౌలురైతు బావిలో కాలుజారి పడి 7గంటల పాటు బావిలోనే ఉన్నాడు. ఆ సమయంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్సై పంజాల మల్లేశంగౌడ్‌కు రాజయ్య భార్య, పిల్లలు ఏడుస్తూ కనిపించడంతో విషయం తెలుసుకుని బావి వద్దకు చేరుకున్నారు. వెంటనే గ్రామస్తుల సహకారంతో గంటపాటు శ్రమించి రాజయ్య ప్రాణాలు కాపాడారు. దాంతో దళిత సంఘాల నాయకులు ఎస్సైని కలిసి కృతఙ్ణతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement