Sunday, April 28, 2024

TS : ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి… కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ

పెద్దపల్లి రూరల్, ప్ర‌భ‌న్యూస్ః ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలియజేశారు. శుక్రవారం నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి ముజామిల్ ఖాన్ కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తన తాత వెంకటస్వామి, తండ్రి వివేక్ 40 ఏళ్లు గా రాజకీయాల్లో ఉండి ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు.

- Advertisement -

ఉపాధి లేక పార్లమెంటు పరిధిలోని యువత దుర్భర జీవితం గడుపుతున్నారని, మహిళలు కనీసం మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధి నోచుకోలేదన్నారు. ఎంపీగా అవకాశమిస్తే 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నిరుపేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుంద‌న్నారు. వంశీకృష్ణ వెంట ఎమ్మెల్యేలు విజయరామనారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య తో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement