Sunday, April 28, 2024

TS: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్..

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇవాళ‌ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ప్రకాష్ గౌడ్ రేపు తన ముఖ్య అనుచరులతో కలిసి పార్టీలో చేరతానని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.

అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరనుండటం సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement