Tuesday, May 14, 2024

బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తా.. – రాష్ట్ర కోశాధికారి విజయసారధి

రామగిరి: బ్రాహ్మణుల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి సముద్రాల విజయసార ధి తెలిపారు. సోమవారం మండలంలోని సెంటినరికాలనీలో ఆయన మాట్లాడుతూ బాసర పుణ్యక్షేత్రంలో జరిగిన రాష్ట్ర బ్రహ్మణ సమాఖ్య సంఘం ఎన్నికలలో అధ్యక్షునిగా జగన్మోహన్‌ శర్మ, ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వర సిద్దాంతి, కోశాధికారిగాగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల బ్రాహ్మణ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం సభ్యుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement