Wednesday, May 1, 2024

కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

జూలపల్లి: కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాల మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న జూలపల్లి కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. నిరుద్యోగ భృతి, బీసీలకు బడ్జెట్‌ తక్కువగా పెట్టడంపై అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్కలను మాట్లాడనివ్వక పోవడంతో నిరసనగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ముందస్తుగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈకార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు మానుమండ్ల శ్రీనివాస్‌, యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కోరెపు సంపత్‌, ఉపాధ్యక్షులు మహంకాళి అంజయ్య, ఏదుల్ల కనకయ్య, బండి స్వామి, సిరికొండ కొమురయ్య, మల్లారపు నరేష్‌, గుంటి రాజయ్య, మల్లారపు రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement