Tuesday, April 16, 2024

డబల్ బెడ్ రూమ్ పేరు చెప్పి… 10 కోట్లకు పంగనామం

హైదరాబాద్ వనస్థలిపురం రైతు బజారు వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ ఇప్పిస్తానని కోటి రూపాయలకు కుచ్చు టోపి పెట్టాడు ఓ మాయగాడు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో పిఏ అంటూ డబ్బులు వసూలు చేశాడు. వివరాల్లోకి వెళ్తే… సుబ్రహ్మణ్యం శర్మ అనే వ్యక్తి డబల్ బెడ్ రూమ్స్ ఇప్పిస్తానని కోటి రూపాయలు వరకు వసూలు చేశాడు. ఓకే కుటుంబానికి చెందిన 10 మంది దగ్గర
ఒక్కరి ఒక్కరి దగ్గర సుమారు 2 నుండి 3 లక్షలు వసూలు చేశాడు.

మోసపోయామని తెలిసిన తరువాత… వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో సుబ్రహ్మణ్యం తో పాటు సొంత బావమరిది పైబాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారనేది ఈ దర్యాప్తులో తేలాల్సి ఉంది. కొత్తపేట సమీపంలోనే నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement