Wednesday, May 8, 2024

అసత్యపు ఆరోపణలు..

మెట్‌పల్లి: పేద ప్రజల అభ్యున్నతికి చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించి సేవ చేస్తున్న పట్టణానికి చెందిన డాక్టర్‌ సత్యనారాయణపై కొందరు చేస్తున్న దుష్ప్రచారం సరికాదని పట్టణ మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మార్గం గంగాధర్‌, ఆకుల ప్రవీణ్‌ పేర్కొన్నారు. స్థానిక విలేకరులతో వీరు మాట్లాడుతూ ధర్మాత్ముడిపై ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎంతో మంది పేద ప్రజలకు సహాయ సహాకారాలు అందిస్తున్న ఆయనపై దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న డాక్టర్‌ సత్యనారాయణపై కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అట్టి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు దుండగులు మానుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement