Saturday, May 18, 2024

పన్నులు చెల్లించి..అభివృద్ధికి సహకరించండి..

పెద్దపల్లిరూరల్‌: ప్రతి ఒక్కరూ విధిగా ఆస్తి పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో ఆయన రూ. 9,66,494ల ఆస్తి పన్నును మున్సిపల్‌ అధికారులకు చెల్లించారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి పన్నులను ప్రజలంతా గడువులోగా చెల్లించాలని కోరారు. పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. పన్నులు చెల్లించడం ద్వారా అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, ఆర్‌ఐ శివప్రసాద్‌, కౌన్సిలర్‌లు రమాదేవి శ్రీధర్‌, నూగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement