Friday, May 3, 2024

KNR: స్వాతంత్రోద్యమంలో కూడా ఆంధ్రప్రభ… క్యాలెండర్ ఆవిష్కరణలో జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్

కాల్వ శ్రీరాంపూర్ (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రభ దినపత్రిక అంటే తనకు చిన్ననాటి నుండి ఎంతో ఇష్టమని, స్వాతంత్రోద్యమంలో కూడా ఆంధ్రప్రభ ఎన్నో కథనాలు రాసిందని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్
జివి.శ్యామ్ ప్రసాద్ లాల్ వెల్లడించారు. మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్ద రాజు పల్లి గ్రామంలో ఆంధ్రప్రభ 2024 నూతల క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ.. చిన్ననాటి నుండి ఆంధ్రప్రభ దినపత్రిక చదవడం తనకు అలవాటని, స్వాతంత్రానికి పూర్వం నుండి ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితమవుతుందన్నారు. 1938లో ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితం ప్రారంభమైందని, దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిజిటల్, వెబ్ విభాగాల ద్వారా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, తాసిల్దారు జావిద్ పాషా, సర్పంచ్ ఓరుగంటి కొమురయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement