Sunday, April 28, 2024

దళితుల అభ్యున్నతికి పెద్ద‌పీట : మంత్రి గుంగుల

దళితులందరూ ఆత్మగౌరవంతో బతకాలనే ఉధ్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బందు పథకానికి శ్రీకారం చుట్టారనాని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో దళిత బంధు లబ్ధిదారునికి ట్రాక్టర్ అందించి స్వయంగా మంత్రి గంగుల ట్రాక్టర్ నడిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ద‌ళితుల అభ్యున్న‌తిని కేసీఆర్ కృషి చేస్తున్నార‌న్నారు. ద‌ళిత బందు ద్వారా ప‌లువురు ల‌బ్ధిదారుల‌కు ట్రాక్ట‌ర్ల‌ను అందించ‌డం జ‌రిగింద‌న్నారు. దీని ద్వారా వారికి ఉపాధి దొర‌క‌డంతోపాటు వారి ఎదుగుద‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌న్నారు. కరీంనగర్ జిల్లాలో ల‌బ్ధిదారులు 10 వేల మైలు రాయి దాటింద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్ , మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement