Wednesday, May 22, 2024

క్షేమంగా ఒడ్డుకు చేరిన 23మంది… సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చందర్

గంగానగర్ బ్యాక్ వాటర్ లో చిక్కుకున్న అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జిల్లాలోని గోదావరిఖని గంగా నగర్ బ్యాక్ వాటర్ లో భారీ వరద నీటిలో చిక్కుకున్న 23 మందిని రెస్క్యూ సిబ్బంది స్పీడ్ బోట్ తో పాటు నాటు పడవల్లో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అర్ధరాత్రి నుండి సహాయక చర్యల్లో స్వయంగా రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ పాల్గొన్నారు. సింగరేణి అధికారులతో పాటు గోదావరిఖని పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరదనీటిలోనే ప్రాణాలు కోల్పోతామని భావించామని, తమను సురక్షితంగా తీసుకువచ్చిన ఎమ్మెల్యే తో పాటు అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement