Saturday, May 4, 2024

శ్రీనివాస్‌ గౌడ్‌ను ఆహ్వానించిన గౌడ సంఘ ప్రజాప్రతినిధులు

ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌ గౌడ సంఘం ఆధ్వర్యంలో బొప్పాపూర్‌ గ్రామంలో నిర్వహించ తలపెట్టిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రావాలని కోరుతూ రాష్ట్ర ఎకై-్సజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను బొప్పాపూర్‌ గౌడ సంఘం ప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు ఆహ్వాన పత్రిక ను అందజేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంకు జిల్లా టిఆర్‌ఎస్‌ పార్టీ అదికార ప్రతినిధి తోట ఆగయ్య ఆధ్వర్యంలో వెళ్లిన నాయకులు రాష్ట్ర ఎ-కై-్సజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రావడానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సానుకూలంగా స్పందించినట్టు- కొండ రమేష్‌గౌడ్‌ తెలిపారు. ఈకార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పీటీ-సీ చీటీ- లక్ష్మన్‌రావు, రాచర్ల బొప్పాపూర్‌ మార్కెట్‌ కమీటి అద్యక్షులు కొండ రమేష్‌ గౌడ్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు వర్స కృష్ణహరి, సర్పంచ్‌ల పోరం మండల అధ్యక్షులు కొండాపురం బాల్‌రెడ్డి, గౌడ సంఘం ప్రతినిధులు చిదుగు గోవర్దన్‌ గౌడ్‌, కిషన్‌ గౌడ్‌, రవిగౌడ్‌, టీ-ఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఇల్లందుల శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement