Sunday, April 28, 2024

నేను ఎవరో వదిలిన బాణం కాదు… ఇక సమరమే :షర్మిల

తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న నేపథ్యంలో వై ఎస్ షర్మిల జిల్లాల నేతలతో సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో షర్మిళ సమావేశం అయ్యారు. పార్టీ ఏర్పాటు,విధి విధానాల పై పార్టీ నేతలకు ఉన్న అనుమానాల పై షర్మిల క్లారిటీ ఇచ్చారు. కాగా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిలను అభిమానులు కోరారు.

అనంతరం షర్మిల మాట్లాడుతూ నేను ఎవరో వదిలిన బాణం కాదు… నేను టీఆర్ఎస్ కో లేక బీజేపీ కో.. బి టీమ్ గా ఉండాల్సిన అవసరం లేదు.సమస్యల సాధనకు తెలంగాణ లో రాజకీయ పార్టీ పెడుతున్నాను. ఖమ్మం వేదిక గానే సమర శంఖం పూరిద్ధామని అన్నారు. ఏప్రిల్ 9 న లక్ష మంది సమక్షం లో పార్టీ ఏర్పాటు ప్రకటన చేద్దామని షర్మిల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement