Sunday, May 5, 2024

రక్తదానం..

గోదావరిఖని: స్వాతంత్య్ర సమరయోధులు, 23 ఏళ్ల వయసులోనే వీరులుగా చరిత్ర పుటల్లో చేరిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుక్‌దేవ్‌ల స్మారకార్థం జరుపుకునే షాహిద్‌ దివస్‌ సందర్భంగా గౌతమినగర్‌ రూరల్‌ డెవలప్మెంట్‌ ట్రస్టు, ఎన్‌జీఓ నిఫా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌ రక్తదాన శిబిరం నిర్వహిస్తుండగా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ట్రస్టు నిర్వాహకులు సోమారపు అరుణ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్‌, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంపంగి శ్రీను, ఎతిరాజ్‌ సురేష్‌, దేవి మోహన్‌ కృష్ణ, పుల్లురి మహేందర్‌, అప్పాజీ అజయ్‌ కుమార్‌, వాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement