Wednesday, May 15, 2024

ఆ ఘనత వైఎస్ దే..’షర్మిల’

కరీంనగర్ : కరీంనగర్ తో వైఎస్ కు విడదీయరాని బంధం ఉందని తెలిపారు వైఎస్ షర్మిల. జిల్లా వైఎస్‌ అభిమానులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కరీంనగర్ కమాన్‌ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తోందన్నారు. సిటీ ఆఫ్ ఎనర్జీ రామగుండం, సింగరేణి మనకు తలమానికం..అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన నేతన్నలు కనిపిస్తారని చెప్పారు. కరీంనగర్ రైతుల కష్టాలు చూసే ఉచిత విద్యుత్‌ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. కరీంనగర్ జిల్లా రైస్‌బౌల్ అనడానికి వైఎస్సే కారణమని చెప్పారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు కట్టించిన ఘనత వైఎస్‌దన్నారు. శాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చారని గుర్తుచేశారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement