Sunday, April 28, 2024

TS: కరీంనగర్ జిల్లాలో.. అడ్లూరి, ఆదిలకు విప్ పదవులు

నలుగురు ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రభుత్వ విప్ లుగా నియమిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు మరో రెండు కీలక పదవులు లభించాయి. మాజీ జెడ్ పి చైర్మన్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్ లను రాష్ట్ర అసెంబ్లీ విప్ లుగా ప్రభుత్వం నియమించింది.

వీరిద్దరికి పదవులు ఇవ్వడం ద్వారా ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు, రెండు మంత్రి హోదాగల విప్ పదవులు దక్కినట్టు అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పెద్దపీట వేయడం పట్ల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement