Sunday, April 28, 2024

Auto Drivers – ఉచితంతో రోడ్డున ప‌డ్డాం.. ఆదుకోకుంటే ప్ర‌జాభ‌వ‌న్ ముట్ట‌డిస్తాం..

హైద‌రాబాద్ – ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీస్ వల్ల ఆటో డ్రైవరలకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఎంఎస్ ఆటో యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం మహిళలు ఆటోల్లో ప్రయాణిస్తారని అన్నారు. అయితే.. గతంలో రోజుకు 1000 రూపాయలు ఆదాయం వస్తే… ఇప్పుడు కనీసం 300 కూడా రావట్లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వం రవాణా చట్టం ప్రకారం ఓలా, ఉబర్, రాపిడ్ వైట్ ప్లేట్ బైక్ లకు అనుమతి ఇవ్వొద్దు అని చెప్పిన పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. రాష్ట్రంలో 8లక్షల మంది ఆటో డ్రైవర్ లు ఉన్నారని.. వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిందని వాపోతున్నారు. ఆటో సంఘాలతో చర్చలు జరపకపోతే ఛలో హైద్రాబాద్ కు పిలుపునిస్తామని, ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చ‌రించారు.

కాగా, ఉచిత ఆర్టీసీ సర్వీస్ స్కిం ర‌ద్దుకు భారతీయ మజ్దూర్ సంఘం అద్వర్యంలో వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వ‌హిస్తామ‌ని ఆటో డ్రైవ‌ర్లు తెలిపారు.. తమ సమస్యల పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల తో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈనెల 18న ధర్నాలు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు 19న వినతిపత్రాలు సమర్పిస్తామని అన్నారు. 20న ఆర్టీసీ డిపోల దగ్గర శాంతియుతంగా ఆందోళన చేపడతామని చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement