మహబూబాబాద్ – ప్రభ న్యూస్ క్రైమ్ – చిన్నారి బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడు మందసాగర్ కు మరణ శిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు లో సంచలన తీర్పు ఇచ్చింది.. వివరాలలోకి వెళితే 2020 అక్టోబర్ 18వ తేదిన న 9 సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ చేసి హత్య చేశాడు ప్రధాన నిందితుడు మందా. సాగర్. దీనిపై కోర్టులో విచారణ జరిగి నేరారోపణ రుజువు కావడంతో అతడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ను ఇచ్చారు మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్ర శేఖర్ ప్రసాద్ .
ఈ హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణశిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా జడ్జి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చి న్యాయ దేవత, పోలీస్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు.