Thursday, May 9, 2024

TS: కాంగ్రెస్ కు 30-40 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీకి స‌భ్యుల్లేరు… హ‌రీశ్ రావు

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి 30- 40 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సభ్యులు లేరని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. యాదాద్రి జిల్లా నకిరేకల్ నియోజవర్గం రామన్నపేటలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…ఇంటింటికి తాగు నీళ్ళు ఇచ్చి నీటి కష్టాలు తీర్చిది కేసీఆర్ అన్నారు. గతంలో ఎమ్మేల్యేలు రావాలంటే ముందు నీళ్ళ ట్యాంకర్ వచ్చి నీటి సమస్య తీర్చేవన్నారు. 2000 పింఛన్లు ఇస్తున్నది సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్నది కేసీఆర్ అన్నారు. అత్తా, కోడళ్ళ పంచాయతీ బంద్ అయ్యింది పింఛన్ల వల్ల అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. 50 ఏళ్ల నుండి ఎందుకు ఇవ్వడం లేదని ప్ర‌శ్నించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటక, ఛత్తీస్గడ్ లో ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. అక్కడ చేతకాదు ఇక్కడ ఎలా సాధ్యమవుతుందని అన్నారు. ఆడబిడ్డ ఉన్న తల్లికి కొండంత అండ కేసీఆర్ అన్నారు. 12 లక్షల 74 వేల మంది పెళ్ళిళ్ళకు చెక్కులు ఇచ్చామ‌న్నారు. ఎమ్మెల్యే కోరిక మేరకు నిధులు పెంచి మొత్తం రూ.17కోట్లతో రామన్నపేటలో మంచి ఆసుపత్రి అందుబాటులోకి తెస్తామన్నారు. నలగ్గొండ, సూర్యాపేట్ లలో మెడికల్ కాలేజీలు తెచ్చామ‌న్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు నేను సర్కారు దవాఖానకు పోతా అంటున్నారన్నారు.

ఇక్కడి నాయకుడు ఒకరు 24 గంటల కరెంట్ రావడం లేదు అంటున్నాడు, అందులో వేలు పెట్టు చూడు కరెంట్ వస్తుందా లేదా తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లేన‌న్నారు. మీ పాలనలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కరెంట్ గురించి ఎంత మాట్లాడితే అంత మంచిది మాకన్నారు. కరెంటు విషయంలో ఎన్నికల్లో వెళ్ళడానికి తాము సిద్ధమ‌న్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా, మా పాలనలో కరెంటు బాగుందా ప్రజలనే తీర్పుకోరుదామ‌న్నారు. దాని మీదే ఎన్నికలకు పోదామ‌న్నారు. త్వరలో అద్భుతమైన మ్యానిఫెస్టో వస్తుందన్నారు. కాంగ్రెస్, బిజెపిల‌కు దిమ్మ దిరిగేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ త్వరలో ఆ శుభవార్త చెబుతారన్నారు. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమ‌న్నారు. కేసీఅర్ మాట తప్పలేదు, తెలంగాణ తెస్తా అన్నాడు సాధించి చూపెట్టాడన్నారు. కానే కాదు.. రానేరాదు అన్న తెలంగాణను ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధించాడ‌న్నారు. ఓట్ల కోసం ఆపద మొక్కులు కాంగ్రెస్ వన్నారు. అందరూ కేసీఆర్ నాయకత్వంను దీవించాలన్నారు. ఎమ్మెల్యే లింగయ్యకు కనీసం హైదరాబాద్ లో ఇల్లు కూడా లేదన్నారు. కళ్ళు మూసినా.. కళ్ళు తెరిచినా నకిరేకల్ ప్రజల సేవ కోసం కృషి చేస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement