Thursday, May 2, 2024

AP: ఉరివేసుకుని వ్యాపారి ఆత్మహత్య

ఇచ్ఛాపురం : పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రత్తి రాజేష్ (49) దాసన్నపేటలోని తన నివాసంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం వేకువజామున రాజేష్ ఎంతకీ తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బలవంతంగా తెరిచి చూడగా.. ప్రత్తి రాజేష్ ఫ్యాన్ కు వేలాడుతూ విగతా జీవుడై కనిపించాడు.

రాజేష్ కు అతని భార్య మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. శరీరంపై రక్తపు మరకలు ఉండడంతో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలం వద్దకు పోలీసులు చేరుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement