Friday, May 17, 2024

AP : బస్సులో త‌ర‌లిస్తున్న 2.40కోట్ల న‌గ‌దు సీజ్‌

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదును పోలీసులు సీజ్‌ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును తనిఖీ చేశారు. అందులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు దేవరపల్లి సర్కిల్‌ సీఐ బాలసురేష్‌బాబు తెలిపారు.

- Advertisement -

మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన సైబరాబాద్‌ పోలీసులకు తాజాగా దాదాపు 4 వేల లీటర్ల మద్యం పట్టుబడింది. హైదరాబాద్ బాచుపల్లి, పేట్‌ బషీరాబాద్‌, బాలానగర్‌ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement