Thursday, May 2, 2024

ఆగి ఉన్న లారీని ఢీకొన్న స్కూటీ – సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి

కొత్తూరు, ఆగస్టు 10(ప్రభ న్యూస్): ఆగిఉన్న‌లారీని స్కూటీని ఢీకొన్న ప్ర‌మాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన కొత్తూరు మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… షాద్ నగర్ పట్టణానికి చెందిన తరుణ్ కుమార్(28) హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ లోనే అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తరుణ్ కుమార్ పని నిమిత్తం షాద్ నగర్ లోని తన ఇంటికి హైదరాబాద్ నుండి స్కూటీపై వస్తుండగా మార్గం మధ్యలో కొత్తూరు మండల కేంద్రంలోని ఐఓసీఎల్ పరిశ్రమ ముందు ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో తరుణ్ కుమార్ తలకు తీవ్ర రక్త గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ హాస్ప‌ట‌ల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తరుణ్ కుమార్ తండ్రి గోపాల్ నందిగామ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement