Saturday, May 4, 2024

వరంగ‌ల్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్..

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) వ‌రంగ‌ల్‌లో ఐ పి ఎల్ క్రికెట్ బెట్టింగ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా వరంగల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఆర్.సంతోష్ నేతృత్వంలో ఐ పి ఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల ఇంటిపై దాడి చేసి న‌లుగురు బెట్టింగ్ ఆర్గనైజర్లను అరెస్ట్ చేశారు. వారి నుండి 4 స్మార్ట్ ఫోన్లు సీజ్ చేశారు. అలాగే 2 లక్షల 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ల ద్వారా క్రికెట్ బెట్టింగ్స్ కాస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది.

ఈ మేరకు గీసుకొండ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఇంటిపై శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో గీసుకొండ ఒకటవ వార్డుకు చెందిన పకంటి పవన్ (24), పకంటి నిశాంతి (26), యాదగిరి గిరిధర్ (24), వీరగొని వంశీకృష్ణ (38) ను అరెస్ట్ చేశారు. తదుపరి చర్యల కోసం గీసుకొండ పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement