Tuesday, April 30, 2024

Boycott – ఇంట‌ర్నల్ పరీక్ష‌లు బ‌హిష్క‌రించిన ఉస్మానియా విద్యార్ధులు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్కరించారు.. సిలబ‌స్ పూర్తి కాకుండానే ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌డాన్ని నిర‌సిస్తూ, ఆందోళ‌న‌కు దిగారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. అయితే కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే ఓయూ అధికారులు పరీక్షలు పెడుతున్నారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

సిలబస్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు నిరసనకు దిగారు. పరీక్షల నిర్వహణపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు వీసీ ఛాంబర్ వెళ్తున్న విద్యార్థులను హాస్టల్‌లోనే ఓయూ సెక్యూరిటీ అడ్డుకుంది.. దీంతో నేడు ఓయూలో జరుగుతున్న ఇంటర్నల్ పరీక్షలకు విద్యార్థులు బాయ్ కాట్ చేశారు. వర్షంలోనే విద్యార్థులు తమ నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement