Tuesday, May 7, 2024

Peddapalli – ఎడతెరిపి లేని వర్షం…. పొంగుతున్న వాగులు వంకలు.. … రాకపోకలకు అంతరాయం

పెద్ద‌ప‌ల్లి – ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారుల పై నుండి నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని రంగంపల్లి రాజీవ్ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు అత్యవసరముంటే తప్ప బయటకి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారు.

పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏసిపి మహేష్, సిఐలు అనిల్ కుమార్, జగదీష్, సత్యనారాయణ, ఎస్సైలు మహేందర్ విజయేందర్, వెంకటకృష్ణ, శ్రీనివాస్, వెంకటేష్, సత్యనారాయణ తో పాటు సిబ్బంది రహదారులపై బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement