Wednesday, May 1, 2024

అమెరికాలో ఆత్మీయుల అభిమానం మరువలేనిది.. వీడ్కోలు సభలో సుబ్బారాయుడు

ఆత్మీయుల పలకరింపు, స్నేహితుల అభిమానం నడుమ 45 రోజులుగా అమెరికా పర్యటన ఆనందంగా గడిచి పోయింద‌ని సీనియర్ జర్నలిస్టు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు మలిశెట్టి సుబ్బారాయుడు అన్నారు. బుధవారం రాత్రి ఇండియా యూఎస్ఏ తల్లిదండ్రుల అసోసియేషన్ లో ఆయనకు జ‌రిగిన స‌న్మాన కార్యక్రమంలో ప్రసంగించారు. ఒక జర్నలిస్టుగా తనకు తానా సభలో సన్మానం జరగడం, స్ఫూర్తి సంస్థ ద్వారా అనుకోకుండా ఆ గౌరవం లభించడం ఆనందదాయకం అన్నారు.

పిల్లల కోసం అమెరికా వచ్చిన తల్లిదండ్రులను కలిపిన భాను ప్రసాద్ ను.. తానా సభలో తనకు సన్మానం చేసిన తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్‌ను అభినందించారు. భారత దేశం నుండి ఉద్యోగ , వ్యాపార రీత్యా, అమెరికా వచ్చిన అందరూ మాతృ భూమిని, మాతృ భాష ను మరువకూడదు అని,
స్వదేశానికి, సొంత గ్రామానికి, తమవంతు సహాయకరంగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement