Saturday, April 27, 2024

త‌ల్లి పరీక్ష రాస్తుంటే.. చిన్నారిని ఆడించిన మహిళా కానిస్టేబుల్!

మహబూబాబాద్ జిల్లాలో టెట్ పరీక్ష ప్రశాంతంగా జ‌రిగింది. పరీక్ష రాసేందుకు చంటిపిల్లల తల్లులు కూడా పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లల ఆలనాపాలనా చూసేందుకు కుటుంబసభ్యులు కొంత‌మంది పరీక్ష కేంద్రాల వద్ద వెయిట్ చేశారు.
అయితే.. ఓ పరీక్ష కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్ ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే మరో పక్క తన మాతృత్వాన్ని చాటుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో 11,429 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్దకు చంటి పిల్లల తల్లులు తమ కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. అభ్యర్థులు పరీక్షలు రాస్తుండగా కుటుంబ సభ్యులు చెట్లకు ఉయ్యాలలు కట్టి పిల్లలను ఆడిస్తుండగా ఓ మహిళా కానిస్టేబుల్ పసి పాపను ఎత్తుకొని ఆడిస్తూ పాలు తాగించ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఆ కానిస్టేబుల్ స‌హృద‌య‌త‌కు అంద‌రూ స‌లామ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement