Saturday, May 11, 2024

సన్న, చిన్నకారు రైతుల పొలాల్లో ఉచితంగా దుక్కి దున్నే కార్యక్రమం..

తెనాలి, (ప్రభ న్యూస్): ఏపీలోని గుంటూరు జిల్లాలో కొత్త ప్రోగ్రామ్​ తీసుకొచ్చారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో పాలడుగు రంగయ్య, అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్న, చిన్నకారు రైతుల పొలాల్లో ఉచితంగా దుక్కిదున్నే కార్యక్రమాన్ని ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ..

యేటా ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్న చిన్నకారు రైతుల పొలాల్లో ఉచితంగా దుక్కి దున్నే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే జెడ్ పి హై స్కూల్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆగస్ట్ 15వ తేదీన 2వేల రూపాయల నగదు బహుమతి అందజేయడం జరుగుతుందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement