Monday, May 20, 2024

తెనాలిలో నూతనంగా న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్.. ప్రారంభించిన మంత్రి విడదల రజని

తెనాలి, (ప్రభ న్యూస్): ఏపీలోని గుంటూరు జిల్లాలో న్యూ లైఫ్​ చిల్ట్రన్స్​ హాస్పిటల్ ప్రారంభమైంది. తెనాలి బోస్ రోడ్ పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ను మంత్రి విడదల రజిని ఇవ్వాల ప్రారంభించారు. హాస్పిటల్ లోని అన్నివిభాగాలను పరిశీలించిన మంత్రి .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని తెలిపారు. వైద్యులందరూ సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు.

రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మేల్యే అన్నాబత్తుని శివ కుమార్ మాట్లాడుతూ.. విద్యా, వైద్యం, వాణిజ్య రంగాలకు తెనాలి పేరుగాంచిందని, అలాంటి ఆంధ్రా ప్యారిస్ లో చిన్నపిల్లల కొరకు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మించడం అభినందనీయమన్నారు. మెరుగైన సేవలు అందిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలని వారు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement