Friday, May 10, 2024

విశాఖ‌లో ఉరుములు, మెరుపుల‌తో ఒక్క‌సారిగా మారిన వెద‌ర్‌.. ప‌లు విమానాల మ‌ళ్లింపు..

విశాఖపట్నంలో వాతావరణం ఒక్కసారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది. దట్టమైన మేఘాలు అలముకోవడంతో పాటు ఉరుములు, మెరుపులు వ‌చ్చాయి. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖలో దిగాల్సిన కొన్ని విమానాలను హైదరాబాద్ కు మళ్లించారు.

ఢిల్లీ నుంచి విశాఖకు రావాల్సిన ఓ విమానాన్ని అధికారులు వెనక్కి మళ్లించారు. ఈ విమానంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ కూడా ఉన్నారు. ఇక, ఢిల్లీ విమానం రాకపోవడంతో మరో కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరీ విశాఖలోనే నిలిచిపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement