Friday, April 26, 2024

HZB Politics: కేసీఆర్‌ పాలనే శ్రీ రామరక్ష.. రాజేందర్ కు ప్రజలే బుద్ది చెబుతారు

Karimnagar: ప్రజలందరికీ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనే శ్రీరామరక్ష అని.. పేదల కళ్లల్లో అనందం నింపుతున్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిపించాలని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ కోరారు. మంగళవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 5,10 వ వార్డులో గడపగడపకు గులాబీ సైన్యం కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను పేద ప్రజలకోసం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్దన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పధకాన్ని ప్రవేశపెట్టన దళితుల దైవం కేసీఆర్‌ అన్నారు. దళిత బంధు తరహ బహుజనులందరికి బహుజన బంధు పధకం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా ఈటల రాజేందర్‌ను ఐదేళ్లు పరిపాలించాలని గెలిపిస్తే ఆయన తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తన ఆస్తులు కాపాడుకునేందుకు రెండున్నర సంవత్సరాల్లోనే రాజీనామా చేసి ఎన్నికలు తీసుకొచ్చారన్నారు. ఈటెల రాజేందర్‌కు రాజకీయ జన్మనిచ్చింది ముఖ్యమంత్రి కెసిఆర్ అని.. కేసీఆర్ లాంటి మహనీయుల పట్ల నీతి మాలిన మాటలు మాట్లాడుతున్న ఈటెలకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement