Thursday, April 25, 2024

TS: ఈత‌కు వెళ్లిన దోస్తులు.. అంత‌లోనే ఏమైందంటే..

Rangareddy: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో విషాదం నెల‌కొంది. ఈత‌కు వెళ్లిన ముగ్గురు దోస్తుల్లో ఇద్ద‌రు నీట‌మునిగి చ‌నిపోయారు. మ‌రోక‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఘ‌ట‌న ఈరోజు మ‌ధ్యాహ్నం జ‌రిగింది.

మొయినాబాద్ మండ‌లంలోని వెంకటాపూర్ కత్వ వద్ద గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ కోసం ఎన్ డి ఆర్ ఎఫ్ టీంతో గాలింపు ముమ్మ‌రం చేశారు. గల్లంతయిన వారి రెండు మృత‌దేహాలు దొరికిన‌ట్టు పోలీసులు చెప్పారు. ఈ ముగ్గురు కూడా మొయినాబాద్ మండల్ సజ్జన్ పల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement