Saturday, April 27, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న హిమాయత్‌సాగర్ సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ప్ర‌మాద‌వ‌శాత్తు కారు బైక్‌ను ఢీకొట్ట‌డంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతివేగం వ‌ల్లే ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని స్థానికులు అంటున్నారు. స్థానికులు వెంట‌నే పోలీసులకు స‌మాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు జార్ఖండ్‌కు చెందిన జితేందర్(30), కేదారేశ్వర్‌(60)గా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement