Wednesday, May 8, 2024

మూడో రౌండ్ ముగిసే నాటికి 4,444 ఓట్ల ఆధిక్యంలో తెరాసా అభ్యర్ధి వాణీ దేవి

మహబూబ్‌నగర్‌ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 3వ రౌండ్ ముగిసే స‌రికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్‌లో వాణీదేవికి 17,836 ఓట్లు ల‌భించడంతో మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు వాణీదేవికి మొత్తం 53,007 ఓట్లు పోల‌య్యాయి. సమీప ప్రత్యర్థి రాంచందర్ రావు కు 48,563 ఓట్లు , ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు 25,505 ఓట్లు, చిన్నారెడ్డికి 10,035 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌ తర్వాత వాణీదేవి 4,444 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement