Saturday, April 27, 2024

Tragedy – డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యానికి రెండేళ్ల చిన్నారి బ‌లి..

హైదరాబాద్ – ఎల్బీ నగర్ లో కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మన్సూరాబాద్‌-ఎల్బీనగర్‌ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్ హఠాత్తుగా కారు డోర్‌ తీశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన బైక్‌కు కారు డోర్‌ తగిలింది. దీంతో బైక్‌పై ఉన్న దంపతులు సహా రెండేళ్ల చిన్నారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ధనలక్ష్మి (2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాప తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే డ్రైవ‌ర్ అక్క‌డ నుంచి ప‌రార్ అయ్యారు.. కారు నెంబ‌ర్ ఆధారంగా అత‌డికోసం పోలీసులు గాలిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement