Wednesday, May 8, 2024

మంత్రి ఎర్రబెల్లిని క‌లిసి సన్మానించిన గిరిజన నాయ‌కులు

హైద‌రాబాద్ : సెప్టెంబ‌ర్ 17వ తేదీన ఆదివాసీ, లంబాడాల ఆత్మగౌర‌వ భ‌వ‌నాలు ప్రారంభోత్సవం.. రిజ‌ర్వేష‌న్లు కూడా 10శాతానికి పెంచుతామ‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేప‌థ్యంలో.. త‌మ‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్న మంత్రి ఎర్రబెల్లికి కృత‌జ్ఞతలు తెలిపారు. ఈ మేర‌కు వారు ఆదివారం హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్ర‌బెల్లిని క‌లిసి స‌త్క‌రించారు. వారి స‌హ‌కారం త‌మ‌కు ఎల్ల‌వేళ‌లా ఉండాల‌ని కోరుకున్నారు. మంత్రిని క‌లిసిన వారిలో జీసీసీ మాజీ చైర్మ‌న్ గాంధీ నాయ‌క్‌, గిరిజ‌న జేఏసీ ధారావ‌త్‌ రాజేశ్ నాయ‌క్‌, భూపాల‌ప‌ల్లి జిల్లా గ్రంథాల‌య సంస్థ మాజీ చైర్మ‌న్ రాజేశ్‌, బొమ్మ‌క‌ల్ ఎంపీటీసీ ర‌వి నాయ‌క్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement