Monday, April 29, 2024

పొన్నియిన్ సెల్వ‌న్ కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతోన్న త‌మిళ ప్రేక్ష‌కులు-రెండు రోజుల్లో రూ.150 కోట్లు

మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వ‌న్. ఈ చిత్రం విడుద‌ల‌యిన‌ప్ప‌డు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చ‌నా వ‌సూళ్ల‌లో దూసుకుపోతోంది. త‌మిళ ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దాంతో, రెండు రోజుల్లోనే పీఎస్1 ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల చిత్రం ‘విక్రమ్ వేద’ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ ‘పీఎస్‌1’కి భార‌త్‌తో పాటు విదేశాల్లో అద్భుత ఓపెనింగ్స్ వ‌చ్చాయి.చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఆదివారం కావ‌డంతో మూడో రోజు కూడా ఇదే జోరు కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. తొలి వీకెండ్ లోనే ఈ చిత్రం 200 నుంచి 250 కోట్ల మార్కును దాటే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement