Friday, May 3, 2024

Breaking : రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

ఆస్పరి సమీపంలో పత్తికొండకు వెళ్లే రోడ్డు నందు బాట లక్ష్మమ్మవ్వగుడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆస్పరి గ్రామానికి చెందిన బత్తిన భీమ లింగప్ప కుమారుడు బత్తిన లక్ష్మన్న(45) పొలంలో పని నిమిత్తం రెండు ఎద్దులు తోలుకుంటూ వెళుతున్న సమయంలో ఆదోని నుండి పత్తికొండకు వైపు వెళుతున్న లారీ అతివేగంతో రోడ్డుపై వెళుతున్న రైతును, ఎద్దును ఢీ కొట్టింది. దీంతో రైతు ల‌క్ష్మ‌న్న అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. రెండు ఎడ్ల‌లో ఒక ఎద్దు మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలియగానే ఆస్పరి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతునికి భార్య పార్వతి, కుమారుడు అంజి, కూతురు ఉన్నారు. ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement